హైదరాబాద్, అక్టోబర్ 12 (నమస్తే తెలగాణ): బీటెక్ బీఈడీ పూర్తి చేసిన వారు డీఎస్సీకి అర్హులేనని విద్యాశాఖ స్పష్టంచేసింది. ఈ మేరకు బుధవారం విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ ఉత్తర్వులు జారీ చేశారు. బీటెక్ సంబంధిత సబ్జెక్టుల్లో బీఈడీ ఉత్తీర్ణులైన వారు సూల్ అసిస్టెంట్ గణితం, సూల్ అసిస్టెంట్ భౌతికశాస్త్రం పోస్టులకు పోటీపడవచ్చని తెలిపింది. రాష్ట్రంలో 5,089 డీఎస్సీ టీచర్ పోస్టుల భర్తీకి గత సెప్టెంబర్ 20 నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్న విషయం తెలిసిందే.