హైదరాబాద్, జూన్ 13 (నమస్తే తెలంగాణ)/శామీర్పేట: అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియా(అస్కీ), నేషనల్ అకాడమీ ఆఫ్ లీగల్ స్టడీస్ అండ్ రిసెర్చ్(నల్సార్) యూనివర్సిటీల మధ్య కీలక ఒప్పందం కుదిరింది. సోమవారం హైదరాబాద్లోని అస్కీలోని బెల్లా విస్టా క్యాంపస్లో ఆస్కీ డైరెక్టర్ జనరల్, డాక్టర్ నిర్మల్య బాగ్చి, నల్సార్ యూనివర్సిటీ రిజిస్ట్రార్, ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. టీచింగ్, ట్రైనింగ్, రిసెర్చ్లో మరింత సమర్థవంతంగా ముందుకెళ్లాలని ఇరువురు అభిప్రాయపడ్డారు. ఈ ఒప్పందం ఐదేండ్ల పాటు కొనసాగుతుంది. బాలకిష్టారెడ్డి మాట్లాడుతూ ఈ ఒప్పందం మెరుగైన విద్యబోధనకు సాధ్యమవుతున్నదన్నారు. సెమినార్లు, వర్క్షాప్లు, సమావేశాలు, ఉమ్మడి విద్యా కార్యకలాపాలు నిర్వహించడం సులభతరమవుతున్నదని తెలిపారు. కార్యక్రమంలో అస్కీ, నల్సార్ వర్సిటీకి చెందిన ప్రొఫెసర్ డాక్టర్ పీవీ రావు, డాక్టర్ వల్లి మాణిక్యం, కల్యాణ్ రాయ్, కే సుబోధ్, డాక్టర్ కర్ణక్ రాయ్, డాక్టర్ ఓంపాల్ సింగ్, రామ్ శిరీష్, పీవీ రావ్, డాక్టర్ వాగేషన్ తదితరులు పాల్గొన్నారు.