హైదరాబాద్, ఆగస్టు 8(నమస్తే తెలంగాణ): కేంద్ర వ్యవసాయ శాఖ మాజీ కార్యదర్శి, ఎమ్మెస్పీ కమిటీ చైర్మన్ సంజయ్ అగర్వాల్ ఇక్రిశాట్ అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్గా సోమవారం బాధ్యతలు స్వీకరించారు. సీనియర్ ఐఏఎస్ అగర్వాల్ ఇటీవల పదవీ విరమణ పొందారు. కేంద్రం తీసుకొచ్చిన మూడు నూతన వ్యవసాయ చట్టాల రూపకల్పనలో ఆయన ప్రధాన పాత్ర పోషించారు. రిటైర్ అనంతరం ఆయనను కేంద్రం ఎమ్మెస్పీ కమిటీకి చైర్మన్గా నియమించింది. తాజాగా ఇక్రిశాట్ అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్గా బాధ్యతలు చేపట్టారు. తెలంగాణ కేంద్రంగా ఉన్న ఇక్రిశాట్లో ఆయన నియామకంపై వ్యవసాయ నిపుణులు, సాగు చట్టాలను వ్యతిరేకిస్తున్న సంఘాల ప్రతినిధులు పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.