హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 5 (నమస్తే తెలంగాణ): పంట పొలాల నుంచి వెలువడుతున్న గ్రీన్హౌస్ వాయువుల (జీహెచ్జీ) పరిమాణాన్ని కొలిచేందుకు హైదరాబాద్లోని ఇక్రిశాట్ ఓ కొలమానినిని రూపొందించింది. దీన్ని ఒడిశాలో ప్రయోగాత్మకంగా పరిశీలించనున్నారు. అందులో భాగంగా ఇక్రిశాట్ పరిశోధకులు ఇటీవల ఆ రాష్ట్రంలో పర్యటించి సంబల్పూర్, బార్గార్, సోనేపూర్ జిల్లాలను ఎంపిక చేసుకున్నారు.
ఆ జిల్లాలోని వరి సాగు క్షేత్రాల్లో జీహెచ్జీ కొలమానులను ఏర్పాటు చేశారు. వరి సాగు వల్ల వాతావరణంలోకి చేరుతున్న గ్రీన్హౌస్ వాయువుల పరిమాణాన్ని వాటితో కొలవనున్నారు. పర్యావరణానికి హాని కలిగిస్తున్న గ్రీన్హౌస్ వాయువులను నియంత్రించడమే లక్ష్యంగా ఈ పైలట్ ప్రాజెక్టును చేపట్టినట్టు ఇక్రిశాట్ పరిశోధకులు తెలిపారు.