హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 4 (నమస్తే తెలంగాణ): స్థానిక వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటల మార్పిడి, సాగు విధానాలు, నీరు, రసాయన ఎరువుల వాడకం, మట్టి నిర్వహణ తదితర అంశాలపై రైతులకు శాస్త్రీయ అవగాహన కల్పించేందుకు ఇక్రిశాట్ సంస్థ ప్రత్యేక యాప్ను రూపొందించింది. ప్రస్తుతం మహారాష్ట్ర, ఒడిశా రాష్ర్టాల నేలల స్వభావానికి అనుగుణమైన సేవలు అందించేవిధంగా ఈ యాప్ను అందుబాటులోకి తీసుకొని రానున్నారు. తొలుత ఈ యాప్ను ఇంగ్లిష్, మరాఠీ భాషల్లో ఆవిష్కరించనున్నారు. ఆ తరువాత దేశంలోని అన్ని ప్రధాన భాషల్లో సిద్ధం చేస్తారు.