హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 22 (నమస్తే తెలంగాణ): ప్రముఖ మెడికల్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్, జూబ్లీహిల్స్ అపోలో దవాఖాన వైద్యుడు సోమశేఖర్రావును ఢిల్లీకి చెందిన టైమ్ సైబర్, డిజిటల్ మీడియా సంస్థ ఇండియన్ హెల్త్ కేర్ (మెడికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్) ఐకాన్ ఆఫ్ ఇండియా 2021 అవార్డుకు ఎంపి క చేసింది. ఢిల్లీలో జరిగిన హెల్త్ కేర్ ఐకాన్ అవార్డు ప్రదానోత్సవంలో బీసీసీఐ చీఫ్ సెలక్షన్ కమిటీ చైర్మన్ చేతన్వర్మ చేతుల మీదుగా డాక్టర్ కే సోమశేఖర్రావు అవార్డుతోపాటు ప్రశంసా పత్రాన్ని అందుకొన్నారు. సోమశేఖర్రావు హెపటైటిస్ వ్యాధిగ్రస్థులకు అందిం చిన వైద్యసేవలకు అవార్డు లభించింది.