హైదరాబాద్, ఏప్రిల్ 19 (నమస్తే తెలంగాణ): దేశంలో మరో 114 కృషి విజ్ఞాన కేంద్రాలు(కేవీకే) ఏర్పాటుకు కృషి చేస్తున్నట్టు ఐకార్ డైరెక్టర్ జనరల్ హిమాన్షు పాఠక్ పేర్కొన్నారు. కేవీకేలను సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్గానూ, ఆయా జిల్లాల వ్యవసాయ విశ్వవిద్యాలయాలుగా మార్చాలని అభిప్రాయపడ్డారు.
ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఐకార్-అగ్రికల్చరల్ టెక్నాలజీ అప్లికేషన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్(అటారీ) పదో జోన్ సంయుక్త ఆధ్వర్యంలో రాజేంద్రనగర్లోని విస్తరణ విద్యా సంస్థ(ఈఈఐ)లో శుక్రవారం రెండు రోజుల సదస్సు ప్రారంభమైంది. 2024-25 సంవత్సరానికి కేవీకేల్లో అమలు చేయాల్సిన వార్షిక ప్రణాళిక గురించి ఈ సదస్సులో చర్చించారు. ఆహార ఉత్పత్తుల వృథాను కట్టడి చేయాలని మేనేజ్ డైరెక్టర్ జనరల్ చంద్రశేఖర్ సూచించారు.