హైదరాబాద్, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ): తెలంగాణ అభివృద్ధి పథంలో పురోగమిస్తున్నదని గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ ప్రశంసించారు. రైస్బౌల్ ఆఫ్ ఇండియాగా తెలంగాణ అభివృద్ధి చెందుతున్నదని కొనియాడారు. ప్రభుత్వ దవాఖానలు మెరుగ్గా పనిచేస్తున్నాయని, కొవిడ్ కట్టడి, టెస్టింగ్లు, వ్యాక్సినేషన్లో వేగంగా మెరుగైనా ఫలితాలు సాధించిందని కితాబిచ్చారు. గవర్నర్గా బాధ్యతలు చేపట్టి రెండేండ్లయిన సందర్భంగా తమిళిసై బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. యంగెస్ట్ స్టేట్కు యంగెస్ట్ గవర్నర్నని వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రజలకు సిస్టర్నని చెప్పారు. గవర్నర్ కార్యాలయాన్ని ఈ-ఆఫీస్గా మార్చారని సీఎం కేసీఆర్, మంత్రులు, ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. లెఫ్ట్నెంట్ గవర్నర్గా ఉన్న పుదుచ్చేరికి తెలంగాణ నుంచి పీపీఈకిట్స్, మాస్క్లు అందజేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఆన్లైన్ క్లాసులు వినేందుకు ఇబ్బంది పడుతున్న పేదవిద్యార్థులకు ప్రైవేట్సంస్థలు, కం పెనీలు వినియోగించిన లాప్టాప్లను ఇవ్వాలని సూచించారు. మెడికల్, ఫా ర్మాహబ్గా హైదరాబాద్ అభివృద్ధి చెందిందని అన్నారు.
సీఎం కేసీఆర్తో మంచి సంబంధాలు
సీఎం కేసీఆర్తో మంచి సంబంధాలు ఉ న్నాయని, ఎలాంటి విబేధాల్లేవని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు గవర్నర్ తమిళిసై జవాబిచ్చారు. ఈ సందర్భంగా ఆమె ‘వన్ అమాంగ్ అండ్ అమాంగెస్ట్ ద పీపుల్’ అనే ఫొటో ఫీచర్ సంకలనాన్ని విడుదలచేశారు.