హైదరాబాద్, ఏప్రిల్ 18 (నమస్తే తెలంగాణ): ఆర్టీసీ బస్స్టాండ్లు, బస్సులు, ఇతర ప్రయాణ ప్రాంగణాలన్నీ పరిశుభ్రంగా ఉంచేందుకు యాజమాన్యం స్వచ్ఛ ఆర్టీసీ పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని బస్స్టాండ్ల ఆవరణలో పాన్, గుట్కాలు నమిలి ఉమ్మివేయడాన్ని అధికారులు ఇప్పటికే నిషేధించారు. అలా చేసేవారిపై చట్టపరంగా చర్య లు ఉంటాయని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆదేశాలు సైతం జారీచేశారు. బస్స్టాండ్ల ఆవరణలో చెత్తాచెదారం వేయకుండా జాగ్రత్తలు తీసుకొంటున్నారు. దాన్ని మరింత ముందుకు తీసుకెళ్తూ ఇప్పుడు బస్స్టాండ్లలో టాయిలెట్లను పరిశుభ్రంగా ఉంచడంపై దృష్టి పెట్టారు. స్వచ్ఛ ఆర్టీసీలో భాగంగా రాష్ట్రంలోని అత్యంత ప్రధానమైన మహాత్మాగాంధీ బస్ స్టేషన్ (ఎంజీబీఎస్)లో టాయిలెట్ల వాడకాన్ని ప్రయాణికులకు ఉచితం చేస్తూ నిర్ణయించారు.
దీన్ని సోమవారం నుంచి అమల్లోకి తెచ్చినట్టు ఉన్నతాధికారులు పేర్కొన్నారు. బస్స్టాండ్ల ఆవరణను మరింత అందంగా తీర్చిదిద్దుతున్నారు. ఇప్పటికే ఎంజీబీఎస్ను ఆధునీకరించారు. ఖమ్మంలోని బస్స్టేషన్ను సైతం సుందరంగా తీర్చిదిద్దారు. కొన్ని బస్టాండ్ల ఆవరణలను పందులు తిరుగాడే దుస్థితిలో నుంచి పూర్తి పరిశుభ్రంగా మార్చడమే కాకుం డా, గోడలకు అందమైన పెయింటింగ్స్ వేయించారు. దేవరకొండ బస్స్టాండ్ వాల్ పెయింటింగ్స్తో ఆకట్టుకొంటున్నది. బస్స్టాండ్ ఆవరణల్లో మలుపు, ప్రమాదకర ప్రదేశాల్లో రాత్రి వేళల్లోనూ వాహనదారులకు, బస్ డ్రైవర్లకు స్పష్టంగా కనిపించేలా కొన్నిచోట్ల రేడి యం స్టిక్కర్లను అతికిస్తున్నారు. ప్రయాణికుల్లో మరిం త అవగాహన పెంచి వారిని సంస్థకు చేరువ చేసేందు కు ఎండీ సజ్జనార్ ప్రత్యేక చర్యలు తీసుకొంటున్నారు. ఇందుకోసం షార్ట్ ఫిలిం కోసం ఆహ్వానం పలికారు.