Hydraa | సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం ఐలాపూర్లో హైడ్రా కూల్చివేతలకు సిద్ధమైంది. శనివారం ఉదయం భారీగా పోలీసులు, హైడ్రా అధికారులు అక్కడకు చేరుకున్నారు. ప్రభుత్వ, ఇనాం భూముల్లో ఈ భవనాలను గుర్తించి వాటికి పెన్సింగ్ వేసే అవకాశం ఉంది. ఈ క్రమంలో కిష్టారెడ్డిపేటలోని కేఏ రెసిడెన్సీ, క్రిస్టల్ డెవలపర్స్ భవనాల్లో ఉండే వారిని వెంటనే ఖాళీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
ఉన్నఫళంగా ఖాళీ చేసి వెళ్లమంటే ఎక్కడికి వెళ్లాలంటూ.. ఆ రెండు భవనాల్లోని 45 ప్లాట్లలో అద్దెకు ఉంటున్న కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తు్న్నాయి. ఇక సర్వే నంబర్ 171, 172, 173, 174, 175, 212, 213 లో రెండుకరాల్లో నిర్మించిన న్యాయవాది ముఖీం గెస్ట్ హౌస్ను హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు.