బంజారాహిల్స్, జనవరి 16: ముగ్గురు పిల్లల తల్లిని ఓ యువకుడు బలవంతంగా ఎత్తుకెళ్లబోయాడు. అతడి దౌర్జాన్యాన్ని అడ్డుకోబోయిన భర్త చాతీపై ప్రేమోన్మాది కత్తితో పొడవటంతో ఆయన ప్రాణాలు కోల్పోయా డు. ఈ దారుణ ఘటన ఫిలింనగర్లో చోటుచేసుకొన్నది. పోలీసుల వివరాల ప్రకారం.. షేక్పేట జైహింద్ కాలనీకి చెందిన వివాహిత (31) 2022లో ఉన్నత విద్య కోసం లండన్కు వెళ్లింది. 4 నెలల తర్వాత ఆమె భర్త గౌస్ మొయినొద్దీన్ ముగ్గురు పిల్లలతో అక్కడికి వెళ్లాడు.
కొన్నాళ్ల తర్వాత గౌస్ పిల్లలతో కలిసి ఇండియాకు తిరిగివచ్చాడు. చదువుకోసం భా ర్య అక్కడే ఉండి నిరుడు నవంబర్లో తిరిగొచ్చింది. లండన్లో ఉన్న సమయంలో అతడితోపాటు షేరింగ్ అకమిడేషన్లో అపార్ట్మెంట్లో ఉన్న వివాహితకు అక్కడే ఉంటున్న హై దరాబాద్వాసి అద్నాన్ హుస్సేన్ అనే యువకుడు పరిచయమయ్యాడు. ఇండియాకు వచ్చిన తర్వాత తరచూ ఫోన్లు చేయడం, భర్తను వదిలిపెట్టి వచ్చి పెళ్లి చేసుకోవాలంటూ ఒత్తిడి చేయడం ప్రారంభించాడు. అద్నాన్ వేధింపులను భర్తకు కూడా చెప్పింది. ఈ నెల 14న రాత్రి అద్నాన్ ఇంట్లోకి ప్రవేశించి గౌస్ భార్యను లాక్కొని తీసుకెళ్లేందుకు యత్నించాడు. ఆమెను బైక్పై ఎక్కించేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో గౌస్ అద్నాన్ను అడ్డుకున్నాడు. అద్నాన్ తన వద్ద ఉన్న కత్తితో గౌస్ చాతీ మీద పొడిచాడు. తీవ్రంగా గాయపడిన గౌస్ను దవాఖానకు తరలించగా ఆదివారం రాత్రిమృతి చెందారు. ఫిలింనగర్ పోలీసులు దర్యాప్తుకేసు చేపట్టారు. అద్నాన్ను పోలీసులు అరెస్టు చేశారు.