హైదరాబాద్, జనవరి 25 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో సంచలనం సృష్టించిన పాస్పోర్ట్ల కుంభకోణంలో తెలంగాణ సీఐడీ దర్యాప్తును వేగవంతం చేసింది. నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి అనర్హులకు పాస్పోర్ట్లు జారీ చేసిన వ్యవహారంలో మరో ఇద్దరిని అరెస్టు చేసింది. అనంతపురానికి చెందిన ఏజెంట్తోపాటు మరొక వ్యక్తిని అధికారులు అరెస్టు చేశారు. వీరి నుంచి పాస్పోర్ట్లు సహా పలు నకిలీ డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు.
దీంతో ఇప్పటివరకు సీబీఐ అరెస్టు చేసిన నిందితుల సంఖ్య 14కు చేరింది. మరోవైపు ఇప్పటికే 92 నకిలీ పాస్పోర్ట్లను గుర్తించిన సీఐడీ.. దేశంలోని అన్ని విమానాశ్రయాలను అప్రమత్తం చేసింది. వీరిలో పలువురు ఇప్పటికే విదేశాలకు వెళ్లగా, ఉన్నవారు దేశం దాటకుండా ఉండేందుకు లుక్ అవుట్ నోటీసులు జారీ చేస్తున్నది. ఏజెంట్ల నుంచి సేకరించిన సమాచారంతో 35కు పైగా పాస్పోర్ట్లను రద్దు చేయించేందుకు ప్రాంతీయ పాస్పోర్ట్ కార్యాలయానికి సమాచారం ఇచ్చారు.