హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 2 (నమస్తే తెలంగాణ): పాస్పోర్ట్ దరఖాస్తుల ప్రక్రియ మరింత వేగవంతం చేయడానికి అద నపు కౌంటర్లు ఏర్పాటు చేసినట్టు హైదరా బాద్ రీజినల్ పాస్పోర్ట్ ఆఫీసర్ దాసరి బాలయ్య శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ కౌంటర్లు సోమవారం నుంచి అందుబాటులో ఉంటాయని వివరించారు. ప్రతి రోజు 40 సాధారణ అపాయింట్మెంట్స్ విడుదల చేస్తారని చె ప్పారు.
ఈ నెల 5 నుంచి 7 వరకు విడు దల చేసే అపాయింట్ మెంట్స్ శనివారం సాయంత్రం www.passportindia.gov.inలో అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. మధ్యవర్తులను ఆశ్రయించి మోసపోవద్దని, పాస్పోర్ట్ సేవలు పారదర్శకంగా అందించేలా చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు.