హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ): మతద్వేషాలు రెచ్చగొట్టే విధంగా సోషల్మీడియాలో పోస్టులు పెడుతున్న ఓల్డ్ మలక్పేట్కు చెందిన సయ్యద్ అబ్దాహు ఖాద్రి అలియాస్ కషాఫ్పై హైదరాబాద్ పోలీసులు పీడీయాక్టు ప్రయోగించారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ మంగళవారం పీడీ యాక్టు ఉత్తర్వులు జారీ చేయడంతో పోలీసులు అతనిని అదుపులోకి తీసుకొని చంచల్గూడ జైలుకు తరలించారు.
ఇటీవల మహమ్మద్ ప్రవక్తపై ఎమ్మె ల్యే రాజాసింగ్ చేసిన అనుచిత వ్యాఖ్య లను నిరసిస్తూ 22వ తేదీ అర్ధరాత్రి బషీర్బాగ్లోని నగర పోలీస్ కమిషనర్ కార్యాలయం ముందు ముస్లిం యువకులు ధర్నా చేశారు. ధర్నాలో పాల్గొన్న కషాఫ్ ఉద్రేకాలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నించాడు. ఆ వీడియోలు సోషల్మీడియాలో పోస్టు చేయడంతో అవి దేశవ్యాప్తంగా వైరల్ అయ్యాయి. ఆ విద్వేషపూరిత వ్యాఖ్యల వీడియోలు హింసను, అల్లర్లను రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని పోలీసులు పేర్కొన్నారు. కషాఫ్ నినాదాల పర్యవసానంగా హైదరాబాద్లో పలుచోట్ల హింసాత్మక ఘటనలు, నిరసన ప్రదర్శనలు జరిగాయి. కషాఫ్ గతంలోనూ ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడు.