హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 3 ( నమస్తే తెలంగాణ): ఈ నెల 9 నుంచి 19 వరకు హైదరాబాద్ నగరంలోని ఎన్టీఆర్ స్టేడియంలో 36వ జాతీయ పుస్తక ప్రదర్శన నిర్వహించనున్నట్టు హైదరాబాద్ బుక్ ఫెయిర్ అధ్యక్షుడు జూలూరు గౌరీశంకర్ వెల్లడించారు. సోమాజిగూడ ప్రెస్క్లబ్లో హైదరాబాద్ బుక్ ఫె యిర్ నిర్వహణ బృందం శనివా రం ఏర్పాటుచేసి న మీడియా స మావేశంలో జూలూరు గౌరీశంకర్ మాట్లాడారు.
పది రోజులపాటు జరిగే ఈ పుస్తక జాతరలో 365 స్టాళ్లు ఉంటాయని, తెలుగు సాహిత్యానికి సంబంధించి 184, ఆంగ్ల సాహిత్యానికి 144, పిల్లల పుస్తకాల కోసం 18, ప్రభుత్వం సమాచారంపై 7, మీడియా రంగం పుస్తకాల కోసం 15 స్టాళ్ల చొప్పున ఉంటాయని వివరించారు. ఈసారి బుక్ ఫెయిర్ ప్రాంగణానికి ప్రజాయుద్ధ నౌక గద్దర్, వేదికకు ప్రముఖ కవి రవ్వా శ్రీహరి పేరిట నామకరణం చేసినట్టు వివరించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం కూడా బుక్ ఫెయిర్ నిర్వహణకు అన్నివిధాలా సపోర్ట్ చేస్తున్నట్టు చెప్పా రు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ అండతో ప్రతి ఏటా బుక్ ఫెయిర్ను ఓ పండుగలా నిర్వహిస్తూ వచ్చామని చెప్పారు. సమావేశంలో కోయ చంద్రమోహన్, శ్రీనివా స్, వాసు, శోభన్బాబు, నారాయణరెడ్డి, యా కూబ్, సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.