హైదరాబాద్, మార్చి 18 (నమస్తే తెలంగాణ): మున్సిపల్శాఖకు ప్రభుత్వం రూ.15,030 కోట్లు కేటాయించింది. హైదరాబాద్ అభివృద్ధికి భారీ నిధులు ప్రతిపాదించింది. పట్టణాల్లో వెజ్ అండ్ నాన్వెజ్ మార్కెట్ల నిర్మాణానికి రూ.500 కోట్లు, వైకుంఠ ధామాల నిర్మాణానికి రూ.200 కోట్లు కేటాయించింది. వరంగల్ నగరాభివృద్ధికి రూ.250కోట్లు, ఖమ్మం నగరానికి రూ.150 కో ట్లు, హైదరాబాద్ మె ట్రోకు రూ.వెయ్యి కోట్లు ప్రతిపాదించింది. మూసీ పరీవాహక ప్రాంత అభివృద్ధికి రూ.200 కోట్లు, హైదరాబాద్లో ఉచిత మంచినీటి పథకం కోసం జలమండలికి రూ.250 కోట్లు కేటాయించింది. హైదరాబాద్ భవిష్యత్ నీటి అవసరాల కోసం రూ.725 కోట్లు, ఓఆర్ఆర్ లోపలి గ్రామాలకు నీటి సరఫరాకోసం రూ.250 కోట్లు ప్రతిపాదించారు. పట్టణాల్లోని మహిళా స్వయంసహాయక సంఘాలకు రూ.566 కోట్లు, స్వచ్ఛ భారత్ మిషన్కు రూ.783 కోట్లు, అమృత్ పథకం అమలుకు రూ.203 కోట్లు, స్మార్ట్ సిటీలకు రూ.288 కోట్లు కేటాయించింది. టీయూఎఫ్ఐడీసీకి రూ.219 కోట్లు, నీటి సరఫరా, నిర్వహణకు రూ.803 కోట్లు ప్రతిపాదించింది.