హైదరాబాద్, జూలై 6(నమస్తే తెలంగాణ): కోర్టుధికార కేసులో ఐఏఎస్ అధికారులైన నవీన్ మిట్టల్, వాకాటి కరుణతో పాటు మరో ఇద్దరు అధికారులకు హైకోర్టు జరిమానా విధించింది. వారితోపాటు కాలేజీ ఎడ్యుకేషన్ రీజినల్ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ జీ యాదగిరి, కుల్వకుర్తి ప్రభుత్వ మాడల్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ఆర్ స్వర్ణలత కోర్టుధిక్కారం కింద రూ.10 వేల చొప్పున జరిమానా చెల్లించాలని, లేనిపక్షంలో నెలరోజుల సాధారణ జైలుశిక్ష అనుభవించాలని ఇటీవల తీర్పు చెప్పింది.
నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తిలోని ప్రభుత్వ మాడల్ డిగ్రీ కళాశాలలో జూనియర్ అసిస్టెంట్ కే శ్రీనివాసరావును తొలగిస్తూ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆ అధికారం కమిషనర్కు లేదని, జాయింట్ డైరెక్టర్కు మాత్రమే ఉన్నదని హైకోర్టు గతంలో ఉత్తర్వులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో శ్రీనివాస్రావును తిరిగి విధుల్లోకి తీసుకోకుండానే జాయింట్ డైరెక్టర్ తొలగింపు ఉత్తర్వులను జారీ చేశారు. దీనిపై దాఖలైన కోర్టు ధికార కేసులో న్యాయమూర్తి జస్టిస్ మాధవీదేవి పైవిధంగా తీర్పు వెలువరించారు. కోర్టు ధికార నోటీసులు అందుకున్నాక శ్రీనివాస్రావును సర్వీస్లోకి తీసుకొని జీతం చెల్లించడం అంటే కావాలనే కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించారని పేరొన్నారు.