హైదరాబాద్, సెప్టెంబర్ 2: హైదరాబాద్ కేంద్రస్థానంగా కార్యకలాపాలు అందిస్తున్న ఎంటార్ టెక్నాలజీ..మరో ఘనత సాధించింది. ఇప్పటికే చంద్రయాన్ మిషన్కు తన విడిభాగాలు సరఫరా చేసిన సంస్థ.. తాజాగా ఆదిత్య ఎల్1 కూడా కొన్ని కీలక భాగాలు సరఫరా చేసినట్లు కంపెనీ ఎండీ పీ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. భారత్ తన తొలి సోలార్ మిషన్ విజయవంతం కావడం చాలా సంతోషంగా ఉన్నది..ఇందుకు ఇస్రో శాస్త్రవేత్తలను అభినందిస్తున్నట్లు చెప్పారు.
ఆదిత్య-ఎల్1 ఉపగ్రహం విజయవంతం కావడంలో హైదరాబాద్కు చెందిన పలు సంస్థలు కీలకపాత్ర పోషించాయి. ఎంటార్తోపాటు ఎస్ఈసీ ఇండస్ట్రీస్, ఈసీఐఎల్, మిధానీలు పలు విడిభాగాలను సరఫరా చేశాయి. వీటిలో ప్రభుత్వరంగ సంస్థలైన ఈసీఐఎల్, మిధానీలు కీలక విడిభాగాలను అందించాయి. అవి కూడా హైదరాబాద్ యూనిట్లో తయారు చేయడం విశేషం.