హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 24(నమస్తే తెలంగాణ) : దేశంలో అన్ని నగరాల్లో కంటే హైదరాబాద్ విద్యార్థులకు ‘ఆత్మవిశ్వాసం’ ఎక్కువ. దేశవ్యాప్తంగా 8-10వ తరగతి చదువుతున్న విద్యార్థులపై చేసిన అధ్యయనంలో మిగతా రాష్ర్టాల పిల్లల కంటే చురుగ్గా, సమన్వయంతో కొత్త టాస్క్ల లక్ష్యాలు చేరుకుంటున్నారని తేలింది. ఎడ్యుటెక్ సేవలు అందించే లీడ్స్కూల్, టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (టీఐఎస్ఎస్) సంయుక్తంగా నిర్వహించిన అధ్యయనంలో దేశ కాన్ఫిడెన్స్ ఇండెక్స్ కంటే 12 పాయింట్లు ఎక్కువ సాధించి 87 పాయింట్లతో హైదరాబాద్ విద్యార్థులు ఉన్నతస్థానంలో నిలిచారు. సీబీఎస్ఈ విద్యార్థులకు స్టేట్ బోర్డు విద్యార్థులు గట్టి పోటీనిస్తున్నట్టు తేలింది. మొత్తం 20 ప్రశ్నలకు విద్యార్థులు ఇచ్చిన సమాధానాల ఆధారంగా ర్యాంకులు కేటాయించారు. ఆత్మవిశ్వాస సూచీ జాతీయ సగటు 78 కాగా, హైదరాబాద్కు చెందిన విద్యార్థులు (87), ఢిల్లీ(80), ముంబై(78), కోల్కత్తా(77), బెంగళూరు(75), చెన్నై (71) పాయింట్లు సాధించింది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల నైపుణ్యాలు మెరుగుపడుతున్నాయని గుర్తించారు.