హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 30 (నమస్తే తెలంగాణ): అన్ని విద్యాసంస్థల్లో భవిష్యత్తు అంతా డిజిటల్ విద్యాబోధనదే అని రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి అన్నారు. బీఆర్ అంబ్కేదర్ ఓపెన్ యూనివర్సిటీలో కొత్తగా ప్రవేశపెట్టిన ‘మూక్స్ ఫర్ టీచర్స్’ కోర్సును మంగళవారం జూమ్ ద్వారా ఆయన ప్రారంభించారు. ఆన్లైన్ బోధనపై అధ్యాపకులకు శిక్షణ ఇచ్చే ఈ వినూత్న కోర్సును ప్రారంభించడం నిజంగా ఎంతో సంతోషంగా ఉన్నదని ఆయన చెప్పారు. సమావేశంలో కళాశాలల విద్యా కమిషనర్ నవీన్మిట్టల్, బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ సీతారామారావు, సెమ్కా డైరెక్టర్ ప్రొఫెసర్ మధు ప్రరార్, కోర్సు రూపకర్తలు.. సెమ్కా సీనియర్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ మానస్ రంజన్ ప్రాణిగ్రాహి తదితరులు పాల్గొన్నారు.