హైదరాబాద్, మార్చి 16 (నమస్తే తెలంగాణ) : హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ (హెచ్డబ్ల్యూవో) పోస్టుల భర్తీకి నిర్వహించిన రాత పరీక్షల తుది ఫలితాలను టీజీపీఎస్సీ సోమవారం విడుదల చేయనున్నది. 581 పోస్టుల భర్తీకి 2022 డిసెంబర్లో నోటిఫికేషన్ విడుదల చేసిన కమిషన్, 2024 జూన్లో రాత పరీక్ష నిర్వహించింది. ఇప్పటికే జీఆర్ఎల్ విడుదల చేసి నాలుగు విడుతల్లో సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ పూర్తిచేసింది. నేటి ఫలితాల్లో ఉద్యోగాలు పొందినవారికి శాఖల వారీగా కౌన్సెలింగ్ నిర్వహించి పోస్టింగ్లు ఇస్తారు.