హుజూరాబాద్: హుజూరాబాద్ ఉప ఎన్నిక సందర్భంగా కమలాపూర్ పోలింగ్ కేంద్రంలో సీఈవో శశాంక్ గోయల్ తనిఖీలు నిర్వహించారు. 306 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోందని ఆయన చెప్పారు. ఇప్పటి వరకూ తమకు 88 ఫిర్యాదులు అందాయని, వాటిపై ఎలక్షన్ అబ్జర్వర్స్ వివరాలు సేకరిస్తున్నారని తెలియజేశారు.
ముఖ్యంగా డబ్బు పంపిణీ విషయంలో అందిన ఫిర్యాదులను క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తున్నట్లు సీఈవో వెల్లడించారు. విచారణలో నిజాలు తేలితే ఎన్నికలు పూర్తయిన తర్వాత కూడా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.