దుండిగల్/ గాంధారి, సెప్టెంబర్ 26: తొమ్మిది నెలల కిందట పరిచయం. ఎనిమిది నెలలు ప్రేమించుకున్నారు. పెద్దలను ఒప్పించి గతనెల 27న పెండ్లి చేసుకున్నారు. కష్టాల్లో తోడుంటానని మూడుముళ్లు వేసిన భర్త నెల గడవకముందే ఆ నవవధువు గొంతుకోశాడు. అనుమానం తో అతి దారుణంగా హతమార్చాడు. ఆపై తానూ గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన బాచుపల్లి పోలీస్స్టేషన్ పరిధిలోని ప్రగతినగర్లో చోటుచేసుకున్నది. పోలీసుల వివరాల ప్రకారం.. కామారెడ్డి సమీపంలోని దేవునిపల్లిలో ఉంటున్న పుట్టల గంగారాం, లక్ష్మీ దంపతుల చిన్న కుమార్తె సుధారాణి(22)కి, కామారెడ్డికి సమీపంలోని శ్రీరాంనగర్కు చెందిన సిద్ధిరాములు, భారతీ దంపతుల కుమారుడు ఎర్రోళ్ల కిరణ్కుమార్ (28)కు ఈ ఏడాది జనవరిలో పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారింది. ఇరు కుటుంబాల మధ్య దూరపు బంధుత్వం ఉండటంతో పెద్దలను ఒప్పించి ఆగస్టు 27న పెండ్లి చేసుకున్నారు.
వారానికే భార్యపై దాడి..
కిరణ్ హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తున్నాడు. సుధారాణి ఎవరితో మాట్లాడినా నుమానించేవాడు. పెండ్లయిన వారం రోజులకే భార్యపై చేయిచేసుకున్నా డు. పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టి మందలించారు. కిరణ్.. భార్య, తల్లిదండ్రులతో కలిసి వారం కిందటే నిజాంపేట కార్పొరేషన్ పరిధిలోని ప్రగతినగర్కు వచ్చాడు. మూ డ్రోజుల కిందట తల్లిదండ్రులు.. బంధువుల అంత్యక్రియల కోసం కామారెడ్డి జిల్లాకు వెళ్లారు. చాలా రోజులైందని, కుమార్తెను చూసేందుకు రావాలని కిరణ్.. అత్తామామలకు ఫోన్ చేసి చెప్పాడు. శనివారం ఇంట్లో పదునైన బ్లేడ్తో సుధారాణి గొంతుకోసి.. అతిదారుణంగా హత్యచేశాడు. భార్య రక్తపు మడుగులో పడి ఉండగానే.. తానూ గొంతు, చేతులు కోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు.
సుధారాణిని చూసేందుకు వచ్చిన ఆమె తల్లిదండ్రులు.. లోపలి నుంచి తలుపులు పెట్టి ఉండటంతో రాత్రి వరకు అక్కడే ఎదురుచూశారు. అనుమానంతో బాచుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు వచ్చి తలుపులు బద్ధలుకొట్టారు. ఇంట్లో రక్తపు మడుగులో అపస్మారకస్థితిలో ఉన్న కిరణ్కుమార్ను చికిత్స కోసం ప్రైవేటు దవాఖానకు, సుధారాణి మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం గాంధీ వైద్యశాలకు తరలించారు. ఈ ఘాతుకానికి అనుమానమే కారణమని పోలీసులు భావిస్తున్నారు. మరోవైపు, ఆగ్రహంతో బంధువులు.. సుధారాణి మృతదేహాన్ని కామారెడ్డిలోని కిరణ్ ఇంటిపై దాడి చేశారు.