Ashutosh Garg | హైదరాబాద్, డిసెంబర్ 14 (నమస్తే తెలంగాణ): మానవ శరీరంలోకి ఆహారంతో పాటే ఐదు విషపూరిత రసాయనాలు ప్రవేశిస్తున్నాయని ప్రముఖ వ్యవసాయ సంబంధ వ్యాపారవేత్త అశుతోష్ గార్గ్ అన్నారు. బుధవారం హైదరాబాద్లో బయో అగ్రి ఇన్పుట్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ నిర్వహించిన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు.
ఆహార కొరతపై హెచ్చరికలు జారీ చేశారు. మనిషి ప్రతిరోజు 5 గ్రాముల మైక్రోప్లాస్టిక్ను తెలియకుండానే తింటున్నాడని తెలిపారు. 2050 నాటికి దేశ జనాభా 1.7 బిలియన్లకు చేరుకుంటుందని, దీంతో ఆహార కొరతను తీర్చేందుకు ప్రస్తుతం ఉన్న 1.66 శాతం వ్యవసాయ ఉత్పాదకత వృద్ధిని 1.75 శాతానికి పెంచాల్సి అవసరం ఉందని వివరించారు. 2040 నాటికి దేశంలో దాదాపు 79 కోట్ల మంది ప్రజలు ఆహార కొరతను ఎదుర్కొంటారని తెలిపారు.