కరోనా నేపథ్యంలో ప్రభుత్వం చర్యలు
హైదరాబాద్, ఏప్రిల్ 28 (నమస్తే తెలంగాణ): కరోనా మహమ్మారి కట్టడే లక్ష్యంగా వైద్యవ్యవస్థను పటిష్టం చేస్తున్న ప్రభుత్వం అందుకు భారీగా నిధులు విడుదలచేసింది. వైద్య ఆరోగ్యశాఖ పరిధిలోని అన్ని విభాగాలకు నిధులు విడుదల చేస్తూ ఆ శాఖ కార్యదర్శి రిజ్వీ ఉత్తర్వులు జారీచేశారు. వైద్య విద్యకు రూ.813.27 కోట్లు కేటాయించగా.. ఎంఎన్జే క్యాన్సర్ దవాఖానకు రూ.25.97 కోట్లు, వైద్య విధాన పరిషత్కు రూ.297.41 కోట్లు ,ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖకు రూ.119.45 కోట్లు, ఆయూష్ విభాగానికి రూ.11.80 కోట్లు, ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమశాఖకు రూ.168.98 కోట్లు, డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్కు రూ.86.50 లక్షలు, ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీకి రూ.2.92 కోట్లు, మెడిసనల్ అండ్ ఆరోమాటిక్ ప్లాంట్స్ బోర్డ్కు రూ.54.85 లక్షలు, కాళోజీ నారాయణరావు హెల్త్వర్సిటీకి రూ.1.65 కోట్లు, మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డుకు రూ.41.51 లక్షలు, తెలంగాణ యోగాధ్యయన పరిషత్కు రూ.4.58 కోట్లు, నిమ్స్కు రూ.109.75 కోట్లు, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసన్కు రూ.10 లక్షలు విడుదల చేసింది.