అయిజ: కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలకు తుంగభద్ర డ్యాంకు వరద పోటెత్తుతున్నది. పెద్దఎత్తున వరద వస్తుండటంతో అధికారులు 30 గేట్లు రెండున్నర అడుగులు ఎత్తి 1,14,823 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 1,18,183 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతున్నది. వరద ప్రవాహం పెరిగే అవకాశం ఉండటంతో తుంగభద్ర నదీ తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసినట్లు టీబీ బోర్డ్ ఎస్ఈ శ్రీకాంత్ రెడ్డి తెలిపారు.