నిజామాబాద్: శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కానసాగుతున్నది. ఎగువ నుంచి ప్రాజెక్టులోకి 59,240 క్యూసెక్కుల నీరు వస్తున్నది. దీంతో అధికారులు 12 గేట్లు ఎత్తి 49,980 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీరామ్సాగర్ పూర్తి నీటిమట్టం 1091 అడుగులు. ప్రస్తుతం 1089 అడుగుల వద్ద నీటిమట్టం ఉన్నది. ప్రాజెక్టు గరిష్ఠ నీటినిల్వ సామర్థ్యం 90 టీఎంసీలుకాగా, ఇప్పుడు 84.810 టీఎంసీల నీరు నిల్వ ఉంది.