హైదరాబాద్, ఏప్రిల్ 12 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)కు భారీగా దరఖాస్తులు వెల్లువెత్తాయి. గడువు ముగిసిన మంగళవారం నాటికి మొత్తం 6,26,928 దరఖాస్తులు నమోదైనట్టు టెట్ కన్వీనర్ రాధారెడ్డి తెలిపారు. పేపర్1కు 3,50,205, పేపర్2కు 2,76,723 దరఖాస్తులు వచ్చాయని పేర్కొన్నారు.
అత్యధికంగా హైదరాబాద్లో 30 వేలు, నల్లగొండలో 24,841, రంగారెడ్డిలో 22,878, మహబూబ్నగర్లో 20,160 దరఖాస్తులు రాగా, ములుగు జిల్లాలో అత్యల్పంగా 1,920 దరఖాస్తులు నమోదయ్యాయి. 3,79,101 అభ్యర్థులు.. 6,26,928 దరఖాస్తులు సమర్పించినట్టు వెల్లడించారు.