హైదరాబాద్ : నాగర్కర్నూల్ జిల్లాలోని కొల్లాపూర్ మండలానికి హార్టికల్చర్ పాలిటెక్నిక్ కాలేజీని ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొల్లాపూర్కు ఉద్యానవన పాలిటెక్నిక్ కాలేజీ మంజూరు కావడంపై ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు కేటీఆర్, నిరంజన్ రెడ్డికి హర్షవర్ధన్ రెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.