హైదరాబాద్ః హిమాయత్ నగరలోని హుక్కా సెంటర్పై డిటెక్టివ్ డిపార్ట్మెంట్కు చెందిన స్పెషల్ క్రైమ్ పోలీసులు దాడి చేశారు. ఈ తనిఖీలో మొత్తం పదమూడు మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. పట్టుబడ్డ వాళ్లలో 11మంది మైనర్లు ఉన్నారు. హక్కా పార్లర్ నిర్వహిస్తున్న మహమ్మద్ ఇఫ్తికార్ను పోలీసులు అదుపులోకి తీసుకుని, హుక్కా సెంటర్ని సీజ్ చేశారు. ఈ దాడిలో ఏడు హుక్కా బాటిళ్లు, మూడు హుక్కా ఫ్లేవర్స్, నాలుగు మందు సీసాలు, 14 మొబైల్ ఫోన్లనతో పాటు రెండు లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు.
‘ఇఫ్తికార్ తన ఇంటిలోని ఒక గదిలో హుక్కా కేంద్రం నిర్వహిస్తున్నాడు. హిమాయత్ నగర్లో కాలేజీలు ఎక్కువ ఉండడంతో యువతను మత్తులోకి దించాలనే ఆలోచనతో నిందితుడు హుక్కా సెంటర్ పెట్టాడు’ అని స్పెషల్ క్రైమ్ పోలీస్ డిపార్ట్మెంట్ జాయింట్ కమిషనర్ గజరావు భూపాల్ చెప్పారు. హుక్కా సెంటర్ నిర్వాహకుడితో పాటు 11మంది మైనర్లు, స్వాధీనం చేసుకున్న సొమ్ము, హుక్కా సామగ్రిని పోలీసులు నారాయణగూడ పోలీస్ స్టేషన్కు తరలించారు. హిమాయత్నగర్లో హుక్కా సెంటర్ నిర్వహిస్తున్నారనే పక్కా సమాచారంతో స్పెషల్ క్రైమ్ పోలీసులు ఈ దాడి చేశారు.