హైదరాబాద్, ఏప్రిల్ 2 (నమస్తే తెలంగాణ): గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) మండల, జిల్లా మహిళా సమాఖ్య పరిధిలో పనిచేస్తున్న అకౌంటెంట్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, అటెండర్లకూ హెచ్ఆర్ పాలసీ వర్తింపజేసేందుకు కృషి చేస్తానని సమాఖ్య ఉద్యోగుల సంక్షేమ సంఘం గౌరవాధ్యక్షుడు, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రూప్సింగ్ భరోసా ఇచ్చారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో ఆదివారం సంఘం రాష్ట్ర విసృ్తత స్థాయి సమావేశం రాష్ట్ర అధ్యక్షుడు నాగరాజు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా రూప్సింగ్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఉద్యోగుల పక్షపాతి అని, ప్రగతిభవన్కు పిలిచి మరీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించిన ఘనత ఆయనదేనని కొనియాడారు.
సెర్ప్ ఉద్యోగులకూ టైం స్కేల్ వర్తింపజేశారని తెలిపారు. సమావేశంలో సెర్ప్ జేఏసీ మహిళా విభాగం అధ్యక్షురాలు సురేఖ, కార్యదర్శి సుదర్శన్, కోశాధికారి వెంకట్, జిల్లా, మండల మహిళా సమాఖ్య ఉద్యోగుల సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ సైదులు, ప్రధాన కార్యదర్శి స్వప్న, కోశాధికారి కవిత, కార్యదర్శి శేఖర్, సహాదారులు నీల, చిరంజీవి, లలిత, మునీందర్ తదితరులు పాల్గొన్నారు.