హైదరాబాద్, మార్చి 5 (నమస్తే తెలంగాణ): కేంద్ర సాహిత్య అకాడమీ కార్యదర్శి కృత్తివెంటి శ్రీనివాస్రావుకు ప్రతిష్టాత్మక డీ లీట్ లభించింది. ఛత్తీస్గఢ్లోని షహీద్ మహేంద్ర కర్మ వర్సిటీ (బస్తర్) గౌరవ డాక్టరేట్ను అందజేసింది. భారతీయ భాషా సాహిత్యానికి విశేష కృషి చేసినందుకు, కేంద్ర సాహిత్య అకాడమీని అభివృద్ధి పథంలో నడిపినందుకు పరిపాలనాదక్షతకు గుర్తింపుగా శ్రీనివాస్రావుకు గౌరవ డాక్టరేట్ను ప్రకటించారు. మంగళవారం ఛత్తీస్గఢ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ చేతుల మీదుగా ఆయన గౌరవ డాక్టరేట్ను అందుకున్నారు.