ఆదిలాబాద్, సెప్టెంబర్ 27(నమస్తే తెలంగాణ): ఆదిలాబాద్ జిల్లా మహారాష్ట్ర సరిహద్దులోని పెన్గంగ నదిపై నిర్మిస్తున్న చనాక-కొరాట ప్రాజెక్టు వద్ద బుధవారం నిర్వహించిన డ్రైరన్ సక్సెస్ అయినట్టు ప్రాజెక్టు ఈఈ రవీందర్ తెలిపారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం వల్ల ఆదిలాబాద్, బోథ్ నియోజకవర్గాల్లో 52 వేల ఎకరాలకు సాగునీరు అందనుంది. బరాజ్ నుంచి నీటిని ఎత్తిపోసేందుకు పంప్హౌస్ను నిర్మించి 5.5 మెగావాట్ల సామర్థ్యం గల మూడు మోటర్లు ఏర్పాటు చేశారు. పంప్హౌస్ నిర్మాణం పూర్తికావడంతో ఆధికారులు ఒక మోటర్ను ఆన్ చేసి డ్రైరన్ చేపట్టారు. త్వరలో వెట్న్న్రు నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎత్తిపోతల పథకాల ప్రభుత్వ సలహాదారు పెంటారెడ్డి, చీఫ్ ఇంజినీర్ టీ శ్రీనివాస్, ఎస్ఈ పీ రాము, ట్రాన్స్కో అధికారులు పాల్గొన్నారు.