ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ దావోస్ పర్యటన ముగించుకొని తిరిగివస్తున్న సందర్భంగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు భారీ ఎత్తున స్వాగత ఏర్పాట్లు చేశారు. ఆదివారం హైదరాబాద్లో పలుచోట్ల స్వాగత హోర్డింగ్లు ఏర్పాటు చేయించారు. 10 రోజుల పర్యటనలో 45 అంతర్జాతీయ సమావేశాల్లో పాల్గొన్నారని, రూ.4,200 కోట్ల పెట్టుబడులు తీసుకొస్తున్నారని వాటిల్లో పేర్కొన్నారు.
– హైదరాబాద్, నమస్తే తెలంగాణ