నీలగిరి, ఆగస్టు 3: మాయమాటలతో అమాయక ప్రజలను మోసం చేసి డబ్బు వసూలు చేయడంతోపాటు మహిళలపై లైంగిక దాడులు పాల్పడుతున్న టెకీబాబా విశ్వ చైతన్యను నల్లగొండ జిల్లా పోలీసులు ఆరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. మంగళవారం నల్లగొండలో ఎస్పీ ఏవీ రంగనాథ్ మీడియాకు వెల్లడించిన వివరాల ప్రకారం.. నల్లగొండ జిల్లా పీఏపల్లి మండలం అజ్మాపురంలో శ్రీసాయి సర్వస్వం, సాయి మాన్సీ చారిటబుల్ ట్రస్టు పేరుతో విశ్వనాథ మురళీ చైతన్య ఆశ్రమం నెలకొల్పాడు. భక్తులకు మాయమాటలు చెప్పి పూజల పేరుతో డబ్బు దండుకునేవాడు. ఓ మహిళ ఫిర్యాదుతో పోలీసులు విచారణ చేపట్టగా ఇప్పటివరకు 11 మంది మహిళలతో ఇతనికి లైంగిక సం బంధాలు ఉన్నట్టు తేలింది. ఆర్థికంగా ఉన్న భక్తులకు సాయి ప్రవచనాలంటూ ఆకర్షించి నగదు, బంగారం తీసుకునేవాడు. అనారో గ్య సమస్యలతో వచ్చేవారికి వనమూలికలు, తైలం, యంత్రాలు అంటగట్టి సొమ్ము చేసుకునేవాడు. ఆశ్రమంలో సోదాలు జరిపిన పోలీసులు రూ.26 లక్షలు, అరకిలో బంగా రం, 17 ఎకరాల డాక్యుమెంట్లు, రూ.3 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్లు, నాలుగు సెల్ఫోన్లు, కారు, ల్యాప్టాప్లు, వనమూలికలు స్వాధీనం చేసుకున్నారు. బాబాకు సహకరించిన మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.
బాబా చరిత్ర ఇలా..
ఏపీలోని కృష్ణా జిల్లా నందిగామకు చెందిన విశ్వనాథ మురళీ చైతన్య డిగ్రీ (ఎంపీజే) పూర్తి చేసి 2002లో హైదరాబాద్లో కంప్యూటర్ సెంటర్ పెట్టి ప్రజలనుంచి రూ.కోటి వరకు తీసుకొని పారిపోగా నాంపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. తర్వాత సాయి భక్తుడిగా మారి పలు టీవీ చానళ్లలో సాయి సచ్చరిత్రపై ప్రవచనాలు చెప్పాడు. 2017లో శ్రీసాయి సర్వస్వం పేరుతో యూ ట్యూబ్ చానల్ను ఏర్పాటుచేశాడు. జెమిని, జీ చానళ్లతోపాటు యూట్యూబ్ చానల్ ద్వారా 40 దేశాల్లో ప్రవచనాల ద్వారా భక్తులను ఆకర్షించ కలిగాడు.