హైదరాబాద్, జనవరి 6 (నమస్తే తెలంగాణ): ఫెమా నిబంధనల ఉల్లంఘన కేసులో ఆంధ్రప్రదేశ్ ఎంపీ కే రఘురామ కృష్ణంరాజుకు తెలింగాణ హైకోర్టులో ఊరట లభించింది. ఈ కేసులో ఆయనకు రూ.40 కోట్ల జరిమానా విధిస్తూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జారీచేసిన ప్రొసీడింగ్స్ అమలును 6 వారాలపాటు నిలిపివేస్తున్నట్టు జస్టిస్ సూరేపల్లి నందా ప్రకటించారు. తదుపరి విచారణను ఫిబ్రవరి 5కు వాయిదా వేస్తున్నట్టు తెలిపారు.