హైదరాబాద్, నమస్తే తెలంగాణ: హైదరాబాద్ నగరం నందగిరిహిల్స్లోని ప్లాట్ నంబర్-1లో వాణిజ్య భవన నిర్మాణానికి సంబంధించిన వివరాలను అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ను హైకోర్టు బుధవారం ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వం, జీహెచ్ఎంసీతోపాటు నిర్మాణ సంస్థ నెట్ నెట్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు నోటీసులు జారీ చేసింది. ‘జూబ్లీహిల్స్లో భాగమైన నందగిరిహిల్స్లోని ప్లాట్ నంబర్-1లో నెట్ నెట్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అక్రమంగా భారీ బహుళ వాణిజ్య నిర్మాణాన్ని చేయడాన్ని సవాల్ చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని హైకోర్టు విచారణ చేపట్టింది. కేబీఆర్ జాతీయ పారును పర్యావరణ సున్నిత ప్రాంతంగా కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో ఏ విధంగా నిర్మాణాలు చేస్తున్నారో చెప్పాలని కోరింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జే అనిల్కుమార్తో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణ మూడు వారాలు పాటు వాయిదా వేసింది.