హైదరాబాద్, జూన్ 8 (నమస్తే తెలంగాణ): కనీస వేతన సలహా మండలి చైర్మన్ నియమకాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను విచారించిన హైకోర్టు..ఈ విషయంలోప్రభుత్వ వాదనను తెలియజేయాలని కోరింది. కార్మికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, కమిషనర్, మండలి చైర్మన్లకు నోటీసులిచ్చింది.
సలహామండలి చైర్మన్గా బీఆర్ఎస్ కార్మిక విభాగం ప్రధాన కార్యదర్శి పీ నారాయణను రాష్టప్రభుత్వం నియమించటం అన్యాయమంటూ తెలంగాణ రీజినల్ కాంట్రాక్ట్ కార్మికసంఘం ప్రధాన కార్యదర్శి మాదిశెట్టి శ్రీనివాస్ పిటిషన్ వేశారు. గురువారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ తుకారాంజీతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్ను విచారించింది. వివరాల సమర్పణకు గడు వు కావాలని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సంజీవ్కుమార్ కోరగా, అనుమతించిన కోర్టు విచారణను జూలై 7కు వాయిదా వేసింది.