హైదరాబాద్ : మొయినాబాద్ ఫామ్హౌస్ డ్రగ్స్ కేసులో మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్రెడ్డి భారీ ఊరట లభించింది. ఈ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఆయనకు ధర్మాసనం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ప్రతి రోజు దర్యాప్తు అధికారి ఎదుట హాజరుకావాలని, పాస్పోర్టును పోలీసులకు సరెండర్ చేయాలని షరతు విధించింది.
ప్రస్తుతం చంచల్గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న రోహిత్ రెడ్డి, తనపై నమోదైన కేసులో బెయిల్ ఇవ్వాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. కేసుకు సంబంధించిన ఇరువర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి బెయిల్పై నిర్ణయం వెలువరించారు.