హైదరాబాద్, ఫిబ్రవరి 28, (నమస్తే తెలంగాణ): ఆదాయానికి మించి ఆస్తులను కూడబెట్టారన్న అభియోగాలతో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డితోపాటు మరికొందరు ఇతరులపై సీబీఐ నమోదు చేసిన కేసులకు సంబంధించి నిందితులు దాఖలు చేసుకున్న డిశ్చార్జి పిటిషన్లను ఏప్రిల్ 30లోగా పరిష్కరించాలని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ టీ వినోద్కుమార్ ధర్మాసనం ఇటీవల హైదరాబాద్లోని సీబీఐ కోర్టుకు ఉత్తర్వులు జారీచేసింది. 20 కేసుల్లోని నిందితుల డిశ్చార్జి పిటిషన్లను 2 నెలల్లోగా తేల్చాలని హైకోర్టు నిరుడు డిసెంబర్ 15నే ఆదేశించింది. కానీ, ఈడీ, సీబీఐ నమోదు చేసిన కేసుల్లో చాలామంది నిందితులు ఉన్నారని, డిశ్చార్జి పిటిషన్ల పరిషారానికి మరింత సమయం అవసరమవుతుందని సీబీఐ కోర్టు అదే తేదీన హైకోర్టు రిజిస్ట్రీకి లేఖ రాసింది. డిశ్చార్జి సిటిషన్లపై విచారణ దాదాపు పూర్తయిందని, దీనికి సంబంధించిన 13 వేల పేజీలు సిద్ధం చేశామని. రికార్డులు పెద్ద అత్యధిక సంఖ్యలో ఉన్నాయని తెలిపింది. ఈ నేపథ్యంలో గడువు ఏప్రిల్ 30 వరకు పొడిగించాలని సీబీఐ కోర్టు కోరడంతో అందుకు హైకోర్టు అంగీకరించింది.