హైదరాబాద్: ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కొత్తగా నిర్మించిన నాలుగు సీనియర్ సివిల్ జడ్జి కోర్టులు నేటి నుంచి అందుబాటులోకి రానున్నాయి. నూతన కోర్టులను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లి నేడు వర్చువల్గా ప్రారంభించనున్నారు. జిల్లా కోర్టులపై పని భారాన్ని తగ్గించడంలో భాగంగా కూకట్పల్లిలో ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి కోర్టు, అదనపు సీనియర్ సివిల్ జడ్జి కోర్టులను నిర్మించారు. అదేవిధంగా మల్కాజిగిరి, ఇబ్రహీంపట్నంలో సీనియర్ సివిల్ జడ్జి కోర్టులను ఏర్పాటు చేశారు.