హైదరాబాద్, జూన్ 21 (నమస్తే తెలంగాణ): ‘ది కానిస్టేబుల్ సినిమా చిత్రీకరణలో నటుడు వరుణ్ సందేశ్ కాలుకు బలమైన గాయమైనట్టు చిత్ర బృందం తెలిపింది. వెంటనే చికి త్స నిమిత్తం దవాఖానకు తరలించామని పేర్కొన్నది. వైద్యు లు వరుణ్ను పరీక్షించి.. మూ డు వారాల పాటు విశ్రాంతి తీ సుకోవాలని సూచించారని వెల్లడించింది.
దీంతో ‘ ది కానిస్టేబుల్ ’ చిత్ర షూటింగ్ నిలిచిపోయింది. ‘మైఖేల్ తర్వాత వరు ణ్ సందేశ్ నటిస్తున్న సిని మా ఇది. పోలీస్ నేపథ్యంలో సాగే ఈ కథలో వరుణ్ కానిస్టేబుల్గా కనిపించనున్నారు. వరుణ్ కో లుకొన్న తర్వాత షెడ్యూల్ను ప్రారంభిస్తామని నిర్మాత బల గం జగదీశ్ వెల్లడించారు.