TG Weather | తెలంగాణలో రాగల రెండురోజులు భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ క్రమంలో ఆయా జిల్లాలకు వాతావరణశాఖ ఎల్లో హెచ్చరిక జారీ చేసింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్క భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వివరించింది.
సోమవారం నుంచి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని పేర్కొంది. పలుచోట్ల బలమైన ఈదురుగాలులు వీస్తాయని చెప్పింది. గడిచిన 24గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి భారీ వర్స్షం కురిసింది. నిజామాబాద్, నిర్మల్, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డ, వికారాబాద్, జయశంకర్, ములుగు, హన్మకొండ జిల్లాల్లో వర్షాలు కురిశాయి. అత్యధికంగా కరీంనగర్ జిల్లా బోర్నపల్లిలో 8.8, కామారెడ్డి జిల్లా గాంధారిలో 7.6 సెంటీమీటర్ల వర్షాపాతం రికార్డయ్యింది.