ఖమ్మం: జిల్లా వ్యాప్తంగా వర్షం కురుస్తున్నది. దీంతో సింగరేణిలో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. ఆదివారం తెల్లవారుజాము నుంచి సత్తుపల్లిలో ఆగకుండా వర్షం కురుస్తున్నది. దీంతో సింగరేణి ఓపెన్కాస్ట్ గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. బొగ్గు బావుల్లో నీల్లు నిలిచిపోవడంతో 10 వేల టన్నుల బొగ్గు, 40 వేల క్యూబిక్ మీటర్ల పనులకు ఆటంకం ఏర్పడింది.