హైదరాబాద్, మే 9 (నమస్తే తెలంగాణ) : విద్యార్థులను తప్పుదోవ పట్టించేలా తప్పుడు ర్యాంకులతో అడ్వర్టయిజ్మెంట్లు ఇచ్చే ప్రైవేట్, కార్పొరేట్ కాలేజీలపై భారీ జరిమానా విధిస్తామని ఇంటర్బోర్డు కార్యదర్శి నవీన్మిట్టల్ హెచ్చరించారు. ప్రకటనకు ఎంత వెచ్చిస్తే అంతే మొత్తాన్ని జరిమానాగా విధిస్తామని తెలిపారు. సంబంధిత కాలేజీ తప్పుడు ప్రకటన ఇచ్చినట్టు తేలితే.. తామే పత్రికల్లో కౌంటర్ అడ్వర్టయిజ్మెంట్ ఇస్తామని స్పష్టంచేశారు. ఇందుకయ్యే ఖర్చును వసూలుచేసిన జరిమానా నుంచే చెల్లిస్తామని చెప్పారు. కాలేజీలిచ్చే అడ్వర్టయిజ్మెంట్లపై నిఘా పెట్టేందుకు ఇంటర్బోర్డులోని ఐదుగురు ఉన్నతాధికారులతో పర్యవేక్షణ కమిటీని నియమించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం నవీన్మిట్టల్ మీడియాతో మాట్లాడుతూ, పత్రికల్లో ప్రకటనలిచ్చేందుకు తాము వ్యతిరేకం కాదని స్పష్టంచేశారు. కాలేజీలకు అడ్వర్టయిజ్మెంట్లు ఇచ్చే స్వేచ్ఛ ఉంటుందని, కానీ, తప్పుడు ప్రకటనలివ్వడం సరికాదని పేర్కొన్నారు. ఒకే పేరుతో యాజమాన్యం ఉన్న విద్యాసంస్థలు ఏ కాలేజీ విద్యార్థికి ర్యాంకు వస్తే ఆయా కాలేజీ కోడ్ నంబర్తోనే అడ్వర్టయిజ్మెంట్ ఇవ్వాలని, అంతేగాని గంపగుత్తగా ప్రకటించడం కుదరదని తెలిపారు.
మార్గదర్శకాలిలా..