హైదరాబాద్, జూన్ 21 (నమస్తే తెలంగాణ): కర్ణాటకలో కురుస్తున్న వర్షాలతో ఆల్మట్టి, తుంగభద్ర ప్రాజెక్టులకు వరద స్థిరం గా కొనసాగుతున్నది. సోమవారం ఆల్మట్టికి 1.41 లక్షల క్యుసెక్కుల వరద వచ్చింది. ఒక్కరోజులోనే సుమారు 13 టీఎంసీల నీరు వచ్చి చేరింది. తుంగభద్ర ప్రాజెక్టుకు 46,250 క్యుసెక్కుల వరద రాగా, సుమారు 4 టీఎంసీలు వచ్చింది. గోదావరి బేసిన్లో ఎస్సారెస్పీకి వరద ప్రవాహం కాస్త తగ్గింది. ఆదివారం సుమారు 9 వేల క్యుసెక్కుల వరద రాగా, సోమవారం 5,139 క్యుసెక్కులకు తగ్గింది.