సంగారెడ్డి : గంజాయి రవాణా పై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఎప్పటికప్పుడు దాడులు నిర్వహిస్తూ గంజాయి రవాణాను అడ్డుకుంటున్నారు. ఆదివారం జిల్లాలోని పటాన్ చెరు ముత్తంగి టోల్ ప్లాజా జంక్షన్ లో ఉమ్మడి మెదక్ జిల్లా ఎక్సైజ్ ఎన్ఫోర్మెంట్ పోలీసలు తనిఖీలు చేపట్టారు. 210 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఐదుగురు వ్యక్తులను అరెస్ట్ చేసి వారివద్ద నుంచి 20 లక్షల విలువ గల గంజాయితో పాటు మూడు వాహనాలు ( 2 స్కార్పియో లు, ఒక షిఫ్ట్ కరు ), అరు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని అసిస్టెంట్ కమిషనర్ రఘురాం వివరాలను వెల్లడించారు.
ఏపీలోని వైజాగ్ నుంచి షోలాపూర్కు గంజాయిని తరలిస్తుండగా పట్టుకున్నామని, నిందితులు సంగారెడ్డి జిల్లా రాయికోడ్ కు చెందిన వారిగా గుర్తించామని రఘురాం తెలిపారు. ఎవరైనా గంజాయి సాగు చేసినా, విక్రయించినా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.