హైదరాబాద్, జనవరి 9 (నమస్తే తెలంగాణ): కృష్ణా నదీ జలాల పంపిణీకి సంబంధించి బ్రిజేశ్కుమార్ ప్రకటించిన అవార్డుపై సుప్రీం కోర్టులో మంగళవారం విచారణ కొనసాగనున్నది. మహారాష్ట్ర, కర్నాటక, ఉమ్మడి ఏపీ రాష్ర్టాలకు కృష్ణా జలాలను పంపిణీ చేస్తూ ట్రిబ్యునల్-2.. 2011లో ప్రిలిమినరీ, 2013 లో తుది అవార్డును ప్రకటించింది. దీనిపై ఉమ్మడి ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. రాష్ట్ర పునర్విభజన అనంతరం తెలంగాణ సర్కారు కూడా రెండు పిటిషన్లు వేసింది. ఆ అవార్డు అమలుకు ఉత్తర్వులివ్వాలన్న కర్ణాటక దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టనున్నది.