జగిత్యాల, మార్చి 29(నమస్తే తెలంగాణ): అతనో ప్రభుత్వ ప్రధానోపాధ్యాయుడు. పేరు ఒడ్నాల రాజశేఖర్. కుక్కతోకలాగే ఈయన బుద్ధి కూడా వంకర. ఒకసారి సస్పెన్షన్కు గురైనా పద్ధతి మార లేదు. అసలు విషయానికొస్తే.. జగిత్యాల రూరల్ మండలంలోని మారుమూల గ్రామమైన బావాజిపల్లె ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో రాజశేఖర్ పనిచేస్తాడు. జనవరి 26న గణతంత్రదినోత్సవ వేడుకల్లో ప్రభుత్వమిచ్చిన యూనిఫాంను కాదని, ప్రత్యేకంగా బీజేపీ రంగులతో తయారు చేయించిన యూనిఫాంను విద్యార్థులచేత బలవంతంగా ధరింప చేశాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. దీనిపై పెద్దఎత్తున వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. పిల్లల తల్లిదండ్రులు రాజశేఖర్ నిర్వాకంపై అసహ నం వ్యక్తంచేస్తున్నారు. విద్యాశాఖ కూడా దీన్ని సీరియస్గా తీసుకున్నది..రేపోమాపో చర్యలు తీసుకోనున్నది. చేసేది ప్రభుత్వ ఉద్యోగమే అయినా ఈయ న బీజేపీకి గట్టి మద్దతుదారుడు. డ్యూటీలో ఉన్నప్పుడు వ్యక్తిగత ఇష్టాలను ప్రదర్శించకూడదన్న సం గతి తెలిసికూడా బరితెగించాడు. పైగా తెలంగాణ ఉ పాధ్యాయ సంఘం జగిత్యాల శాఖ అధ్యక్షుడిగా కూడా పనిచేశాడు. పిల్లల్లో ఎలాంటి తారతమ్యాలకు తావులేకుండా చూడాల్సిన హెచ్ఎం ఇలా ప్రవర్తించటంపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతున్నది.
2019 పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఒడ్నాల రాజశేఖర్ బీజేపీ పట్ల తన పక్షపాతాన్ని బహిరంగంగా ప్రదర్శించాడు. నిజామాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి అరవింద్కు బాహాటంగా మద్దతు తెలిపాడు. దీనిపై అప్పట్లో విపక్షాలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాయి. దీంతో కొన్ని రోజుల పాటు రాజశేఖర్పై ఎన్నికల సంఘం సస్పెన్షన్ వేటు వేసింది. అయినా ఆయన వైఖరిలో ఎలాంటి మార్పు రాలేదని గణతంత్రదినోత్సవం నాటి సంఘటన రుజువు చేస్తున్నది.