హైదరాబాద్, మే 16 (నమస్తే తెలంగాణ): పాఠశాల రికార్డుల్లో (టీసీల్లో) కుల ప్రస్తావన లేకుండా చూడాల్సిందిగా ప్రభుత్వానికి ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ అందిన ఓ లేఖను హైకోర్టు ప్రజాహిత వ్యాజ్యంగా పరిగణించింది.
హైదరాబాద్లోని బీహెచ్ఈఎల్ మాజీ మేనేజర్ ఎస్ నారాయణ రాసిన ఆ లేఖపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ తుకారాంజీ ధర్మాసనం ఇటీవల విచారణ చేపట్టింది. ప్రతివాదులైన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి, సంచాలకులకు నోటీసులు జారీచే, తదుపరి విచారణను జూలై 31కి వాయిదా వేసింది.